క్యాష్ షో లో ఇంత మోసమా.. వారందరూ స్టూడెంట్స్ కాదా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షోలో సుమ యాంకర్ గా వ్యవహరిస్తూ షోకి వచ్చిన సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతివారం ప్రసారమవుతున్న ఈ క్యాష్ షో వల్ల ఈటీవీ కి మంచి రేటింగ్స్ లభిస్తున్నాయి. మల్లెమాల వారు నిర్వహిస్తున్న ఈ క్యాష్ షో కి తక్కువ ఖర్చు చేసి ఎక్కువ లాభాలు పొందుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ క్యాష్ షో గురించి ఒక వార్త వైరల్ గా మారింది. క్యాష్ షోలో కనిపించే స్టూడెంట్ లో నిజమైన వారు కాదని.. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులుగా ఉన్న వారందరిని స్టూడెంట్స్ గా తెచ్చి జనాలను మోసం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రతివారం జూనియర్ ఆర్టిస్టులను ఈ షోకి తీసుకువచ్చి స్టూడెంట్స్ లాగా అందరిని మోసం చేస్తున్నారని… అంతేకాకుండా ఈ షోలో పైన నుండి తోసేసే సామాన్లు అన్నీ కూడా నిజమైనవి కాదని ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు అర్థమవుతుంది. అంతేకాకుండా షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు చివర్లో ఇచ్చే డబ్బుల విషయంలో కూడా నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు అందరూ కూడా ప్రమోషన్స్ కోసం మాత్రమే ఈ షోలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇలా క్యాష్ లో చూపించే స్టూడెంట్స్, సామాన్లు, విన్నర్ కి ఇచ్చి డబ్బులు అన్ని కూడా అపద్దమే అని తెలిసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

క్యాష్ షో ద్వారా మల్లెమాల వారు ప్రేక్షకులని ఇంత మోసం చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. అయితే ఈ విషయాలలో మల్లెమాల వారు మోసం చేసినా కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ షో లో యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ కొన్ని సంవత్సరాలుగా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ షో కి మంచి రేటింగ్స్ వచ్చేలా చేస్తోంది.