ఆది గురించి సీక్రెట్ రివీల్ చేసిన ఇంద్రజ…ఆది ఫోన్ లో మొత్తం అమ్మాయిలే అంటూ?

ఈటీవీలో ప్రసారం అవుతున్న టీవీ సీరియల్స్, షోస్ ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఈటీవీ ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్ని ఇచ్చింది. ఇక ఈటీవీలో మల్లెమాల సంస్థ కూడా ఎన్నో టీవీ షోస్ ని ప్రారంభించి ఎంతోమంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇలా ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీకి బుల్లితెర ఛానల్ గా ఒక చరిత్ర ఉంది. ఈటీవీ ప్రారంభించి 27 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీరియల్ నటీనటులు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులతో పాటు మరికొంతమంది సినీ తారలు కూడా సందడి చేశారు.

ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి, అలి వంటి ప్రముఖులు కూడా సందడి చేశారు. ఇక ఈటీవీ కి దూరమైన అనసూయ,సుధీర్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఎప్పటిలాగే ఆది, రాంప్రసాద్ కామెడీ పంచులు, సెటైర్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అలీ మాట్లాడుతూ.. ఆది వాట్సాప్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని అడగ్గా.. ఇంద్రజ స్పందిస్తూ అందులో మొత్తం అమ్మాయిలే. ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అని అడగండి అంటూ ఆది సీక్రెట్ బయటపెట్టింది. దీంతో ఆది ఒక్కసారిగా తెల్ల మొహం వేశాడు. మొత్తానికి ఈ కార్యక్రమంలో అందరూ ఆదిని బాగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

ఇక ఈ 27వ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న సుధీర్ కూడా ఎప్పటిలాగే తన పంచలతో సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో సుధీర్ మీద ఆది వరుస సెటైర్లు వేస్తూ రెచ్చిపోయాడు. ఇక పోసాని కృష్ణమురళి గారు కూడా ఈ కార్యక్రమంలో బాగా రచ్చ చేశాడు. ఒక సందర్భంలో సీరియల్ నటి హరిత మాట్లాడుతూ ఈటీవీ తమకి జీవితాన్ని ఇచ్చి పెళ్లి కూడా చేసిందని చెప్పగా ప్రదీప్ ని చూపిస్తూ మరి వీడికి ఎందుకు పెళ్ళాన్ని ఇవ్వటం లేదు అని పోసాని ప్రదీప్ మీద సెటైర్ వేశాడు. ఇక మరొక సందర్భంలో సీనియర్ నటి యమున కూడా ఒక స్కిట్ చేస్తున్న సమయంలో పోసాని నువ్వు నా భార్యవి మనిద్దరం అన్యోన్యంగా ఉంటూ చర్చించుకుందామనిరెచ్చిపోయాడు.