జబర్దస్త్ గురించి కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్లపై స్పందించిన ఆది, రాంప్రసాద్.. ఏమన్నారంటే?

ప్రస్తుతం ఇండస్ట్రీలో జబర్దస్త్ షో గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ గా మారుతుంది. గత కొన్ని రోజులుగా జబర్దస్త్ నుండి ఫేమస్ కమెడియన్లు బయటికి వెళ్లిపోవడంతో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ ఆర్పీ తాజాగా జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఫేమస్ అయిన ఆర్పీ ఇప్పుడు జబర్దస్త్ కి వ్యతిరేకంగా మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది, రాంప్రసాద్ ఈ విషయం గురించి స్పందించారు. ఈ సందర్భంగా కిరాక్ ఆర్పీ జబర్దస్త్ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆది రాంప్రసాద్ మండిపడ్డారు. కిరాక్ ఆర్పీ చెప్పినవన్నీ అబద్ధాలేనని వారు చెప్పుకొచ్చారు . ఒకప్పుడు జబర్దస్త్ ని తన తల్లితో పోల్చిన కిరాక్ ఆర్పీ ఇప్పుడు జబర్దస్త్ గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదని అన్నారు. జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించడానికి మేము ఇంటర్వ్యూకి వచ్చాము అంటూ ఆది రాంప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక మల్లెమాల వారు సుధీర్, రష్మీ కి పర్సనల్ లైఫ్ లేకుండా చేశారు అని ఆర్పీ అన్న మాటలకి క్లారిటీ ఇచ్చారు.

సుధీర్ ని అవమానించడం వల్లే సుధీర్ బయటికి వచ్చాడు అని ఆర్పీ అన్న మాటలకు సమాధానంగా.. సుధీర్ ని అలా అవమానించి మాట్లాడటం వల్లే ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మల్లెమాల వారు సరైన భోజనాలు పెట్టక అక్కడ అందరినీ కేజీఫ్ సినిమాలో బానిసలుగా చూసారు అని ఆర్పీ అన్నాడు. దీనికి సమాధానంగా ఎన్నో ఏళ్లుగా మేమందరం కూడా అదే భోజనం తింటున్నాం. కొన్ని వేల మందికి భోజనం పెట్టేటప్పుడు రోజు బిర్యానీలు పెట్టడం కుదరదు కదా అని ఆది క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.