డబ్బులు తీసుకుని నన్ను మోసం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్న గీతు…?

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్న గీతు రాయల్ గురించి ఇప్పుడు తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో గేమ్ ఆడుతూ.. కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన గీతు అనూహ్యంగా తొమ్మిదవ వారంలో ఎలిమినేట్ అవ్వటం ప్రేక్షకులకే కాకుండా హౌస్ మేట్స్ కి కూడా చాలా షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ప్రతిక్షణం టైటిల్ విన్నర్ గా నిలవాలని కష్టపడిన గీతు రాయల్ ఇలా అర్ధాంతరంగా ఎలిమినేట్ అవ్వడంతో షాక్ కి గురయ్యింది. బిగ్ బాస్ వదిలి వెళ్ళటానికి ఇష్టం లేక నన్ను పంపించకండి అంటూ కన్నీళ్లు పెట్టుకొని మరీ వేడుకుంది. కానీ ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత అక్కడినుండి బయటికి రాక తప్పలేదు.

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత గీతు ఇప్పటివరకు బిగ్ బాస్ బజ్ కి తప్పా మరెక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ క్రమంలో తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటీవల ఒక వీడియో విడుదల చేసి తన బాధని బయటపెట్టింది. ఈ వీడియోలో గీతు మాట్లాడుతూ…అవును నేను ఓడిపోయాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఇంత తొందరగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వస్తానని కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది. తను ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటానికి తన తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటమే కారణమని చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా తాను బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళేముందు తనని ప్రమోట్ చేయడానికి కొంతమందికి రూ. 25 వేలు డబ్బు ఇచ్చానని,కానీ వాళ్ళు తన గురించి ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా చేయలేదని తన బాధ వెల్లడించింది. తనని ప్రమోట్ చేస్తానని డబ్బులు తీసుకొని అయినవారే తనని మోసం చేశారని చెప్పుకొచ్చింది. వారిని నమ్మి దైర్యంగ హౌజ్ లోకి అడుగుపెట్టా..కానీ వారి నుండి నాకు సపోర్ట్ లేదని బయటికీ వచ్చిన తర్వాతే తెలిసిందని చెప్పుకొచ్చింది. గత బిగ్ బాస్ సీజన్ లలో విన్నర్ గా నిలిచిన అభిజిత్, కౌషల్ నేనేం తక్కువ? అప్పుడు వారు చేస్తే కరెక్ట్? ఇప్పుడు నేను చేస్తే తప్పా? అంటూ తన మనసులో బాధని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.