నాడీ చూసి రష్మి కి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్… షాక్ లో రష్మి..?

బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన రష్మి సినిమాలలో కూడా నటించింది. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ షో ద్వారా రష్మి నటిగా కన్నా యాంకర్ గా బాగా పాపులర్ అయింది. దీంతో రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎన్నో సంవత్సరాలుగా యాంకర్ గా కొనసాగుతోంది. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న అనేక కార్యక్రమాలలో కూడా రష్మి సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఈ షోలో సుధీర్, రష్మి మధ్య ఉన్న లవ్ ట్రాక్ వల్ల కూడా బాగా ఫేమస్ అయ్యింది.

ఇదిలా ఉండగా తాజాగా రష్మి గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఈవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో డాక్టర్ రేష్మి నాడి పట్టుకుని చూసి ఆమెకు శుభవార్త చెప్పాడు. దీంతో రష్మి ఒక్కసారిగా షాక్ అయింది. అసలు విషయానికి వస్తే ఈవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆటో రాంప్రసాద్ డాక్టర్ వేషం వేశాడు. ఈ క్రమంలో రాంప్రసాద్ రష్మీ వద్దకు వెళ్లి ఆమె నాడి పట్టుకుని చూసి కంగ్రాట్యులేషన్స్ మీకు ఒక గుడ్ న్యూస్ అంటూ చెప్పాడు. దీంతో రష్మి ఒక్కసారిగా షాక్ అయ్యింది. రాంప్రసాద్ ఇలా ఇన్ డైరెక్ట్ గా రష్మి ప్రెగ్నెంట్ అని చెప్పటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు.

ఇక ఈవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో సీనియర్ హీరోయిన్ కుష్బూ జడ్జిగా హాజరయ్యారు. మనో స్థానంలో జడ్జ్ గా వచ్చిన కుష్బూ రష్మి తో కలిసి అందంగా డాన్స్ చేస్తు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షో కుష్బూ కూడా రామ్ ప్రసాద్ మీద కౌంటర్లు వేసింది. రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా మీకు చెన్నై లి గుడి కట్టారు కదా? మీరు కూడా జబర్దస్త్ లో ఉండిపోతే మేము కూడా మా గుండెల్లో గుడి కడతాం అంటూ చెప్పగా..ఇంకా గుడి కట్టాలేదా? అంటూ కుష్బూ రాం ప్రసాద్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ లో యాదమ్మ రాజు సుజాత ని కన్య కాదని చెప్పు షాక్ ఇచ్చాడు.