గీతా ఆర్ట్స్ లో యంగ్ డైరెక్ట‌ర్ ల‌క్కీ ఛాన్స్

గీతా ఆర్ట్స్ లో పేప‌ర్ బోయ్ డైరెక్ట‌ర్?

ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అల్లు అర‌వింద్ సార‌థ్యంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించింది. ఇదే సంస్థ‌కు అనుబంధ సంస్థ‌గా గీతా ఆర్ట్స్ 2 (జీఏ2) బ్యాన‌ర్ వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని నిర్మిస్తోంది. ఈ బ్యాన‌ర్ లో ఇప్ప‌టికే 100 ప‌ర్సంట్ ల‌వ్.. గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు తెర‌కెక్కాయి. ఇక ఈ బ్యాన‌ర్ లో ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో `ప్ర‌తి రోజు పండగే` తెర‌కెక్కుతోంది. దీంతో పాటే అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వేరొక సినిమాని గీతా ఆర్ట్స్ 2 సంస్థ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

వీటితో పాటే ఈ బ్యాన‌ర్ లో వేరొక సినిమా కూడా క‌న్ఫామ్ అయ్యింద‌ని తెలుస్తోంది. యంగ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణుతో పేప‌ర్ బోయ్ ఫేం జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రానికి స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. గీతా ఆర్ట్స్ లో ఛాన్స్ అంటే ల‌క్కీ ఛాన్స్ అనే చెప్పాలి. శ్రీ‌విష్ణు.. జ‌య‌శంక‌ర్ ఇద్ద‌రికీ ఇదో స‌ద‌వ‌కాశం. బ్రోచేవారెవ‌రురా లాంటి క్లాసిక్ హిట్ త‌ర్వాత శ్రీ‌విష్ణుకి ఇది పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీఏ2 సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.