టాలీవుడ్లో రైటర్గా ఎన్నో సూపర్ హిట్లు అందించిన వక్కంతం వంశీ, డైరెక్ట్ చేసిన సినిమాలతో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాడు. అల్లు అర్జున్తో చేసిన నా పేరు సూర్య ఆశించిన విజయం అందకపోవడం, ఆ తర్వాత నితిన్తో చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ కూడా ఫెయిల్ కావడం, అలాగే అఖిల్ ఏజెంట్ సినిమాకు ఇచ్చిన కథ పెద్దగా నిలవకపోవడం వంశీని వెనక్కి నెట్టేశాయి.
తాజాగా వంశీ గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో చర్చలు జరుపుతున్నాడని టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ సపోర్ట్తో వంశీ రాసిన కథలపై ఇప్పటికే కీలక మీటింగ్స్ పూర్తయ్యాయని, త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించబడవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
వంశీ కెరీర్లో బన్నీ సపోర్ట్ ఎప్పటినుంచో ఉంది. మొదట డైరెక్ట్ చేసిన సినిమా కూడా బన్నీతో కావడం, ఇప్పుడు మళ్లీ అదే సపోర్ట్తో గీతా ఆర్ట్స్లోకి రావడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈసారి వంశీ తన టాలెంట్ చూపించి విజయవంతంగా తిరిగి వస్తాడా? అన్నది చూడాలి. గీతా ఆర్ట్స్, జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లపై ఇప్పటికే పలు హిట్లు వచ్చాయి. ఇక వక్కంతం వంశీ చేయబోయే కొత్త సినిమా అతనికి రీ-ఎంట్రీ అవుతుందా? అన్నది అభిమానుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.