‘బిగ్‌బాస్ -2’ ఫైనల్ కు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో  పూర్తైంది. ఈ షోలో విజేతగా కౌశల్‌ నిలిచారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో చివరి రోజు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తారని అంతా ఆశించారు. నాని, ఎన్టీఆర్ కలిసి చేసే హంగామా ఈ షో చివరి రోజు గుర్తుండిపోయాలే ఉంటుందని అని భావించారు. కానీ వెంకటేష్ ని సీన్ లోకి తెచ్చారు నిర్వాహకులు. దాంతో ఎన్టీఆర్ అభిమానులే కాక బిగ్ బాస్ అభిమానులు సైతం నిరాశపడ్డారు. దాంతో ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అన్న ప్రశ్న చాలా మందిలో ఉదయించింది.

మీడియా సర్కిల్స్ లో ఇదే విషయమై వినపడుతున్న టాక్ ని బట్టి…మొదట ఎన్టీఆర్ ని పిలుద్దామనుకున్నారు కానీ ఆయన వస్తే నాని సైడ్ లైన్ అయ్యిపోతారనేది ఒకటైతే, మరొకటి అందరి దృష్టీ ఎన్టీఆర్ పైనే ఉంటుంది. విజేత ని కానీ మరొకరిని కానీ  పట్టించుకోరు.ఇవన్నీ ఆలోచించి వద్దనుకున్నారు. అయితే మరొకొంతమంది మీడియా మిత్రులు చెప్పేదేమిటంటే…ఎన్టీఆర్ ని పిలిచారు కానీ …ఆయన తన తాజా చిత్రం అరవింద సమేత   రిలీజ్  కేవలం పది రోజులే ఉంది. ఫైనల్ కట్, డబ్బింగ్, ప్యాచ్ వర్క్స్ లు  పనులు హడావిడిలో ఉన్నాను..ఇప్పుడు రాలేను అని చెప్పినట్లు చెప్తున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం అనేది ఎన్టీఆర్ లేదా ఆ పోగ్రాం నిర్వాహకులు చెప్పాలి.

ఇదిలా ఉంటే మరో ప్రక్క  ‘బిగ్‌ బాస్‌’ ఫస్ట్‌ సీజన్‌కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్‌నే మళ్లీ ‘బిగ్‌ బాస్‌ 3’కి కూడా హోస్ట్‌గా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

 

మరొక హాట్ న్యూస్

తెలంగాణలో బాలయ్య పర్యటన ఆంతర్యం ఏమిటి (వీడియో)