చరణ్‌ గుర్రం మ్యాటర్… రివీల్ చేసిన అల్లు హీరో

రామ్‌ చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’.సంక్రాంతికి రిలీజ్ పెట్టుకున్న ఈ చిత్రానికి సంభందించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు (గురువారం) ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు జూక్‌బాక్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ విలన్లతో ఫైట్ కు గుర్రంపై వెళ్తూ కనిపించారు. ఇక ఈ గుర్రం ప్రత్యేకతం గురించి ఓ విషయం తెలియచేసాడు అల్లు శిరీష్.

‘ఎంత అద్భుతమైన పోస్టర్‌. చాలా నచ్చింది. ‘వినయ విధేయ రామ’ కోసం చక్కటి ఎపిసోడ్‌లను తీశారని చిత్ర యూనిట్ ద్వారా విన్నాను. వాటిని స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. సినిమాకు ది బెస్ట్‌ ఇవ్వాలని దర్శక, నిర్మాతలు రామ్‌చరణ్‌ కోసం గుర్రాన్ని నెదర్లాండ్స్‌‌ నుంచి తెప్పించారు’ అని అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశారు.

‘ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది’ అని రానా అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్ గా చేస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు . దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.