త్రివిక్రమ్ శర్వానందకి ఇచ్చిన మాట మరిచారా?

మాయావి ప్రామిస్ ని నిల‌బెట్టుకుంటారా?

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్… టాలీవుడ్ లో రేర్ ట్యాలెంట్. మాట‌ల మాయావి. స్టార్ డ‌మ్ పెంచ‌గ‌లిగే స‌మ‌ర్థత ఉన్న‌ ద‌ర్శ‌కుడు. ఈయ‌న‌తో సినిమా చేయాల‌ని ప్ర‌తి స్టార్ ఎదురుచూస్తుంటారు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. ఈ స్టార్ డైరెక్ట‌ర్ కొన్నేళ్ల క్రితం వెర్స‌టైల్ హీరో శ‌ర్వానంద్‌కి మాటిచ్చార‌ట‌. త‌ను హీరో అయితే అత‌నితో సినిమా చేస్తాన‌ని ప్రామిస్ చేశార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హీరో శ‌ర్వానంద్ తెలిపారు. శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం `ర‌ణ‌రంగం` ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం కాకినాడ‌లో నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ హాజరై ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ వేదిక‌పై త్రివిక్ర‌మ్ సాక్షిగా త‌న పాత జ్ఞాప‌కాల్ని గుర్తుచేసుకున్నారు శ‌ర్వా. త‌ను ఆర్టిస్ట్‌గా వేషాల కోసం తిరుగుతున్న సంద‌ర్భంలో త్రివిక్ర‌మ్ పేరున్న రైట‌ర్ గా ప‌నిచేస్తున్నార‌ని.. ఆ స‌మ‌యంలో ఓ సినిమాలో వేషం ఇమ్మ‌ని అడిగితే “నువ్వు హీరోగా వున్న సంద‌ర్భంలో నీతో సినిమా చేస్తాన‌ని.. ఇప్పుడే ఛాన్సివ్వ‌లేన‌ని చెప్పారు. అప్పుడు ఆయ‌న ఎందుక‌లా అన్నారో నాకు అర్థం కాలేదు. ఈ రోజు హీరోగా ఆయ‌న ముందే నిలుచుని వున్నాను“ అని శ‌ర్వా ఎమోష‌న్ అయ్యారు.

త్రివిక్ర‌మ్ మాత్రం వేదిక‌పై మాట్లాడుతూ దానిపై స‌రిగా రెస్పాండ్ కాలేదు ఎందుక‌నో. మాయావి మాట్లాడుతూ .. “ర‌ణ‌రంగం ట్రైల‌ర్ ని మ‌రోసారి చూడాల‌ని అనిపించింది. ట్రైలర్ అంత ఇంప్రెస్సివ్ గా వుంది. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ టేకింగ్‌ ఎక్స్ ట్రార్డిన‌రీగా వుంది. రెండు పాత్ర‌ల్లో హీరో శ‌ర్వానంద్ పెర్ఫార్మెన్స్ అద్భుతం“ అంటూ స‌రిపుచ్చారు. శ‌ర్వాతో సినిమా చేస్తాన‌ని మాత్రం చెప్ప‌క‌పోవ‌డం.. త‌ను చేసిన ప్రామిస్ గురించి మ‌ర్చిపోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ చిత్రానికి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. కాజ‌ల్ క‌థానాయిక‌. శ‌ర్వా గ్యాంగ్ స్ట‌ర్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.