`నిజం క‌క్క‌లేని బ‌యోపిక్కులొద్ద‌యా`: మెగా హీరో ఘాటు కామెంట్‌

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న మూవీ ఎన్టీఆర్ బ‌యోపిక్‌. ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు అనే టైటిళ్ల‌తో రెండు భాగాలుగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోందీ సినిమా. మ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర‌ మీద తీస్తోన్నబ‌యోపిక్ కాబ‌ట్టి.. ఇప్ప‌టిదాకా ఎవ‌రూ పెద్ద‌గా నెగెటివ్ కామెంట్స్ చేయ‌లేదు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఎవ‌రూ ఆ సాహ‌సం చేయ‌లేద‌ని భావించ‌వ‌చ్చు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై మొద‌టిసారిగా ఓ గ‌ళం వినిపించింది. అది కూడా మెగా కాంపౌండ్ నుంచి కావ‌డం విశేష‌మే మ‌రి. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ బ‌యోపిక్ మీద ప‌రోక్షంగా సెటైర్లు విసిరారు. `నిజం క‌క్క‌లేని బ‌యోపిక్కులొద్ద‌యా..` అంటూ త‌న విమ‌ర్శ‌నాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో నిజాల‌ను వ‌క్రీక‌రించారంటూ వ‌స్తోన్న వార్త‌ల‌కు మెగా బ్ర‌ద‌ర్ కామెంట్‌..మ‌రింత బ‌లాన్ని చేకూర్చిన‌ట్టుంది. మొన్న‌టికి మొన్నే ఏకంగా బాల‌కృష్ణను టార్గెట్ చేసుకున్నారు నాగ‌బాబు. బాల‌కృష్ణ ఎవరో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మూవీ మీదే విమ‌ర్శ‌లు చేశారు.

`క‌ట్టుక‌థ‌లు కొన్ని, క‌ల్ప‌న‌లు ఇంకొన్ని చుట్ట‌నేల‌..మూట క‌ట్ట‌నేల‌, నిజం క‌క్క‌లేని బ‌యోపిక్కులొద్ద‌యా విశ్వ‌దాభిరామ విన‌ర‌వేమ‌` అంటూ చేత్తో రాసిన ఓ ప‌ద్యాన్ని ఆయ‌న త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. చివ‌ర్లో బ‌లంగా ఏదైనా ఆయ‌న‌కు రాయాల‌నిపించిన‌ట్టు అనిపించి ఉంటుంది.

క‌విత్వాలు మాకూ వ‌చ్చండోయ్ అనే సెటైర్‌ను బ్రాకెట్‌లో రాసుకొచ్చారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను నంద‌మూరి, నారా వారి కుటుంబం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఈ ప‌రిస్థితుల్లో మెగా కాంపౌండ్ నుంచి ఓ వ్య‌తిరేక గ‌ళం వినిపించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.