కడుపులోనే బిడ్డ చనిపోయింది.. జానీ మాస్టర్ కథ వింటే కన్నీరు ఆగదు!

Jani Master About Her Personal Life

తెలుగు నాట డ్యాన్స్ మాస్టర్స్ హవా ప్రస్తుతం కొనసాగుతోంది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్, ప్రేమ్ రక్షిత్ ఇలా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు. పలు డ్యాన్స్ ప్రోగ్రాంలకు న్యాయ నిర్ణేతలుగా ఉంటూ శేఖర్, జానీ మాస్టర్‌లు మరింత దగ్గరయ్యారు. అందుకే వీరిద్దరి సోషల్ మీడియాలో సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే పండుగలకు చేసే ప్రత్యేక ఈవెంట్లలో వీరిద్దరు తెగ సందడి చేస్తుంటారు.

Jani Master About Her Personal Life
Jani Master About Her Personal Life

వినాయక చవితికి జీ తెలుగు చేస్తోన్న బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్లో.. జానీ మాస్టర్ దుమ్ములేపనున్నాడు. ఈయనతో పాటుగా బాబా భాస్కర్ కూడా వచ్చేశాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో వీరిద్దరు చేసిన సందడి మనమంతా చూశాం. అయితే తాజగా విడుదల చేసిన ప్రోమో అందర్నీ కంటతడి పెట్టించింది. తండ్రీ కూతుళ్ల విలువ, ప్రేమ తెలిసేలా ఓ పర్ఫామ్ చేశారు. అందులో ప్రధానంగా నిహారిక, నాగబాబును బేస్ చేసుకుని డ్యాన్స్ పర్పామెన్స్ చేశారు.

ఇక కూతురి విలువ చెప్పే క్రమంలో జానీ మాస్టర్ తన గతాన్ని తెలిపి అందర్నీ కంటతడి పెట్టించారు. తనకు మొదట బాబు పుట్టాడని ఇక రెండోసారి పాప పుట్టాలని, పేరు కూడా అలియా అని ఫిక్స్ చేశానని తెలిపాడు. అలియా అని పిలిస్తే కదిలినట్టు అనిపించేదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ బిడ్డ కడుపులో ఉండగానే చనిపోయిందని, బయటకు తీసిని ఆ పిండాన్ని ఎత్తుకుని అలియా అంటూ ఏడ్చానని పేర్కొన్నాడు. ఇప్పుడు తనకు పుట్టిన పాపనే అలియా అంటూ తన కూతురిపై ప్రేమను చాటుతూ అందర్నీ ఏడిపించేశాడు.