నా భార్యకు జిమ్ ట్రైనర్ తో సంబంధం : హాస్యనటుడి ఆరోపణ

నటుడు, టీవీ యాంకర్‌ దాడి బాలాజీ, ఈయన భార్య నిత్య మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడి బాలాజి, నిత్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. వీరి విడాకుల పిటిషన్‌ విచారణలో ఉండగానే మరో సారి గొడవలు పడ్డారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు ఆమెపై చేసారు.

బాలాజీ మాట్లాడుతూ… సినీ రంగంలో తన ఎదుగుదలను చూసి తన భార్య నిత్య అసూయ పడుతోందన్నాడు. అలాగే తనూ నటి కావాలన్న ఆశతో శరీర బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లి,… అక్కడ జిమ్‌లోని ట్రైనర్ తో పరిచయం పెంచుకుని రిలేషన్ పెట్టుకుందని అన్నారు.

దీన్ని ఖండించిన తాను తన స్నేహితుడైన ఎస్‌ఐ మనోజ్‌కు ఫిర్యాదు చేశాన్నారు. అయితే అతను చర్యలు తీసుకోకుండా, తన కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మనోజ్‌ తన భార్యకు ఒక మోబైల్‌ ఫోన్‌ కొనిచ్చాడని, ఆ ఫోన్‌ ద్వారా వారిద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. తన భార్యను కలిసి రెండేళ్లకు పైగా అయ్యిందన్నారు.

అప్పటి నుంచి ఆమె తనపై నేరారోపణలు చేస్తూనే ఉందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తన కూతురు భవిష్యత్‌ దెబ్బతింటుందన్నారు. తన భార్య, ఎస్‌ఐ మనోజ్‌ కారణంగా తన కూతురు ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా మనోజ్‌పై చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తన కూతురిని ఏదైనా రెసిడెంట్‌ పాఠశాలలో చేర్పిస్తే మంచిదని, ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని దాడి బాలాజి వెల్లడించారు

మరో ప్రక్క తన భర్త దాడి బాలాజి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నాడని నిత్య చెన్నైలోని వెప్పేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు దాడి బాలాజీని ఫోన్‌లో విచారించగా తాను షూటింగ్‌ కారణంగా వేరే ఊరిలో ఉన్నానని, చెన్నైకి తిరిగి రాగానే కలుస్తానని చెప్పారు.