రామ్ గోపాల్ వర్మ మీద పోలీసులకు కర్నూలు ఎమ్మెల్యే ఫిర్యాదు

సంచాలలను నెత్తికెత్తుకునే చిత్రదర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కర్నూలు టిడిపి ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశారు. లక్ష్మీస్ ఎన్టీయార్ ట్రెయిలర్ తాను యూ ట్యూబ్ లో చూశానని, అందులో చంద్రబాబు కుట్రదారుగా, ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి గా చూపారని ఆయన కర్నూల్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు లేఖను వర్మ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ట్రెయిలర్ ఒక పాట వుందని, ఆయన పాట అర్థం తమ నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు ఉందని ఇది తమనే ప్రతిష్టను దిగజార్చేదిగా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద వెంటనే తగు చర్య తీసుకోవాలని కోరారు.