చ‌క్క‌న‌మ్మ‌కు క‌రెంట్ అలా షాక్ కొట్టింది!

                                సామాన్యుల‌కే కాదు మాన్యుల‌కు క‌రెంట్ షాక్!

నాలుగు నెల‌లుగా కొవిడ్ 19 మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు జంక్ష‌న్ జామ్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రూ ప‌నుల‌కు వెళ్ల‌క అంత‌టా గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్లు స‌డ‌లించేయ‌డంతో అద‌ను చూసి ఇంకా ఇంకా కొవిడ్ విజృంభిస్తోంది. మార్చి నెల నుంచి అస‌లు క‌రెంట్ ఉద్యోగులు మీట‌ర్ బిల్లులు తీయ‌డం ఎగ్గొట్టేశారు. దీంతో ప్ర‌స్తుతం బిల్లుల్లో జంత‌ర్ మంత‌ర్ తీవ్ర ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా దేశం యావ‌త్తూ ఇదే ప‌రిస్థితి.

తాజాగా ఇలాంటి కార‌ణ‌మే ముంబైలో త‌న పోష్ అపార్ట్ మెంట్ లో నివ‌శిస్తున్న తాప్సీకి కూడా త‌గిలింద‌ట‌. ఉన్న‌ట్టుండి జూన్ బిల్లు చూసి షాక్ తిందిట‌. త‌మ కొత్త అపార్ట్ మెంట్ లో క‌రెంట్ బిల్లు ఇలా షాక్ కొడుతుంద‌ని ఊహించ‌లేద‌ని వాపోయింది. తాప్సీ సోష‌ల్ మీడియాల్లో బిల్లుల్ని షేర్ చేసింది. ఈ జూన్ లో రూ .36000 బిల్లు రాగా.. ఏప్రిల్ బిల్లు రూ .4390.. మే బిల్లు రూ .3850 ఇంత వ‌చ్చింది.

ఊహించ‌నంత ఈ డిఫ‌రెన్స్ చూసి షాక్ కి గురయిన తాప్సీ వెంట‌నే ముంబైలో బిల్లులు తీసే అదానీ ఎల‌క్ట్రిసిటీ బోర్డ్ వాళ్ల‌కు సోష‌ల్ మీడియాల్లో ఫిర్యాదు చేసింది. జ‌రిగిన త‌ప్పిదానికి వివ‌ర‌ణ ఇచ్చిన అదానీవాళ్లు త్వ‌ర‌లో స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు.