ట్రైలర్ దుమ్ము రేపింది..డైలాగ్స్ కేక

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరక్షన్ లో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్జీకే’. సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇందులో సూర్య దేశం కోసం పోరాడే ఓ రాజకీయ నాయకుడిగా కనిపించారు.

‘ఓ చిన్న గుంపును వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారు అనుకున్నావా?’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైన ట్రైలర్ ..మొదట నుంచి చివరి వరకూ ఆసక్తిగా సాగింది. సూర్య రాజకీయ ప్రవేశంపై ఆయన తల్లి భయపడుతూ కనిపించారు. ‘ఇలా చదువుకున్న వాళ్లంతా మనకెందుకు అని పారిపోవడం వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది’ అని ఓ వ్యక్తి అంటున్నారు.

NGK Telugu - Official Trailer | Suriya, Sai Pallavi, Rakul Preet | Yuvan Shankar Raja | Sri Raghava

‘రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకీ, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కు ఉంది’ అంటూ సూర్య ఆవేశంతో ప్రసంగించడం ఇంట్రస్టింగ్ గా ఉత్తేజభరితంగా ఉంది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సూర్య నటిస్తోన్న మరో చిత్రం ‘కాప్పాన్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాప్పాన్ సినిమా ఆగస్టులో ప్రేక్షక్షుల ముందుకు రాబోతోంది.