సైరా దర్శకుడికి మరో హీరో దొరికినట్లే..

సైరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టాలని అనుకున్న సురేందర్ రెడ్డి అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాడు. తెలుగులో కూడా ఆ సినిమా పెద్దగా రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. అయితే ఆ సినిమా అనంతరం దర్శకుడు సురేందర్ రెడ్డి మళ్ళీ పాన్ ఇండియా లాంటి సినిమా చేస్తాడని అనుకుంటే ఎప్పటిలానే కమర్షియల్ రూట్ లోకి వచ్చేశాడు.

ఇక తన మీడియమ్ రేంజ్ లోనే సినిమాలు చేసుకోవడం బెటర్ అనుకున్నాడో ఏమో కాని నెక్స్ట్ సినిమాను అఖిల్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఆ సినిమా కోసం బడ్జెట్ కూడా గట్టిగానే అవుతున్నట్లు సమాచారం. ఇక ఆ సినిమా తరువాత సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

అలాగే ఈ స్టార్ డైరెక్టర్ కు మరో హీరో దొరికేసినట్లు తెలుస్తోంది. యువ హీరో రామ్ కూడా ఒక సినిమా చేయడానికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. లాక్ డౌన్ లోనే కొన్ని కథలను సెట్ చేసుకున్న సురేందర్ రెడ్డి రామ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇక ఇటీవల కథ మెయిన్ లైన్ ను వినిపించి ఒప్పించాడట. చేతిలో ఉన్న రెండు సినిమాల తరువాత అతనిని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.