మ‌హేష్- ప‌ర‌శురామ్ టైటిల్ ఇదే?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌ర్వాత మ‌హ‌ర్షి ఫేం వంశీ పైడిప‌ల్లితో సినిమా చేస్తాడ‌ని భావిస్తే ఊహించ‌ని షాకిచ్చారు మ‌హేష్‌. అనూహ్యంగా పైడిప‌ల్లిని ప‌క్క‌న పెట్టేసి ప‌ర‌శురామ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అత‌డు వినిపించిన స్క్రిప్టులో మార్పు చేర్పులు ఇప్ప‌టికే లాక్ డౌన్ పీరియ‌డ్ లో పూర్తి చేసేశారు. జూన్ నుంచి షూటింగులు ప్రారంభించుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తులు వ‌చ్చేశాయి కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాళిక సిద్ధ‌మైపోతోంది.

ఇక‌పోతే ఈ సినిమాకి అప్పుడే టైటిల్ కూడా ఖ‌రారైపోయింద‌న్న గుస‌గుస ప‌రిశ్ర‌మ‌ని వేడెక్కించేస్తోంది. అస‌లింత‌కీ ప‌ర‌శురామ్ ఎంపిక చేసిన టైటిల్ ఏది? అంటే… `స‌ర్కార్ వారి పాట‌` అన్న టైటిల్ వినిపిస్తోంది. టైటిల్ కి సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న భ‌ర‌త్ అనే నేను ఫేం కియ‌రా అద్వాణీ నాయిక‌గా ఎంపికైంది. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ.. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్నారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ కొరియోగ్ర‌ఫీ అందిస్తారు.

ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్- ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ బాబు ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఆ మేర‌కు తాజాగా రివీలైన పోస్ట‌ర్ లో వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. అయితే ఈ వివ‌రాలు నిజ‌మా కాదా? అన్న‌దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉందింకా.