చిక్కుల్లో క‌మ‌ల్ `విశ్వ‌రూపం 2`

                                                                 (మోహన్ కుమార్) 

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తీవ్ర‌వాదంపై సరికొత్త కోణంలో చేసిన సినిమా `విశ్వ‌రూపం 2`. రాజ్‌క‌మ‌ల్ ఇంటర్నేష‌న‌ల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రాన్ని క‌మ‌ల్ హాస‌న్ నిర్మించారు. సినిమా ఆగ‌స్ట్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాకు ఆర్ధిక‌ప‌ర‌మైన స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.  పిరమిడ్‌ సైమిర ప్రొడక్షన్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కమల్‌కు వ్యతిరేకంగా దావా వేసింది. త‌మ‌కు రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ ఇవ్వాల్సిన 5.44 కోట్ల రూపాయ‌ల‌ను వ‌డ్డీ స‌హా క‌లిపి అయిన మొత్తం 7.75 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించాలని.. అప్ప‌టి వ‌ర‌కు `విశ్వ‌రూపం 2` విడుద‌ల ఆపాల‌ని కోరింది. దీనిపై రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ సోమ‌వార వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మద్రాసు హై కోర్టు ఆదేశించింది.