లక్ష్మీపార్వతిపై శ్రీరెడ్డి దారుణ కామెంట్స్

శ్రీరెడ్డి కూడా రామ్ గోపాల్ వర్మ పంథాలోనే వెళ్తున్నట్లున్నారు. ఆమె ఏమి మాట్లాడినా అందులో ఎవరో ఒకరి వ్యక్తిగతంగా విమర్శలు ఉంటున్నాయి. తాజాగా ఆమె ఓ యూట్యాబ్ ఛానెల్ తో మాట్లాడుతూ..లక్ష్మీ పార్వతిపై దారుణమైన విమర్శలు చేసారు. త్వరలో ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాలో ఆమె లక్ష్మీ పార్వతిగా కనిపించబోతోంది. ఆ సినిమాలో నెగిటివ్ పాత్రగా లక్ష్మీ పార్వతి ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ విషయమై శ్రీరెడ్డిని ప్రశ్నిస్తే ఆమె స్పందించారు. లక్ష్మీపార్వతిని వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ… ”ఎన్టీఆర్ గారు 1923లో పుట్టారు.. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగ్రంధం సుబ్బారావు గారు 1937లో పుట్టారు.. తనకంటే పెద్దవాడని కాపురం చేయలేకపోతున్నానని భర్తని, పదహారేళ్ల బిడ్డను వదిలేసింది లక్ష్మీపార్వతి. ఆవిడేం తల్లి అసలు..?” అంటూ లక్ష్మీపార్వతిని టార్గెట్ చేసింది. వీరగ్రంధం గారి కంటే ఎన్టీఆర్ వయసులో ఇంకా పెద్దవాడని అతడితో లక్ష్మీపార్వతికి ఎలాంటి వ్యత్యాసాలు రాలేదా..?” అంటూ ప్రశ్నించింది.

”ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో ఒంటరైపోతే తనే దగ్గరుండి చూసుకున్నానని లక్ష్మీపార్వతి చెప్పేది.. మరి ఈమె వదిలేస్తే తన భర్త, పిల్లాడు ఒంటరి వాళ్లు కాలేదా..?” అంటూ మండిపడింది.

ఇక ప్రతి మనిషిలో మంచి, చెడూ రెండూ ఉంటాయని, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలని చెప్పింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో లక్ష్మీపార్వతి తను సపోర్ట్ చేస్తున్న వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఆమెని పాజిటివ్ యాంగిల్ లో చూపిస్తున్నారని అంది. అదేవిధంగా కేతిరెడ్డి ఆమెలో నెగెటివ్ షేడ్స్ చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఈ రెండూ తప్పు కాదని అంది. ఎవరేం చెప్పినా.. అసలేం జరిగిందో జనాలకు తెలుసునని.. వాళ్లకు నచ్చితేనే సినిమాలు ఆడతాయని క్లారిఫై ఇచ్చింది.