ఆంజనేయ భక్తుడైన మెగాస్టార్ తన పేరుని చిరంజీవిగా ఎలా మార్చుకున్నాడో మనందరికి తెలిసిందే. అయితే దైవ భక్తి ఎక్కువగా ఉన్న చిరు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కంచిగారి వీధిలో ఉన్న రంగణ్ణచారి సన్స్ అండ్ మెటల్ వర్క్స్లో వెండి మండపం చేయించుకున్నారు. దీనిని ఎప్పుడో ఆర్డర్ ఇవ్వగా, గురువారం చిరు ఇంటికి చేరింది. దీనిని చిరంజీవి పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా చేయించుకున్నారు. వెండి మండపంతో పాటు దానిని తయారు చేసిన వారితో చిరు ఫోటోలు దిగగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ఆగస్ట్ 22న తన 152వ చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు మన మెగాస్టార్ .