వైరల్ : ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఎంత అయ్యిందో తెలిసిందే షాకే..!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాల్లో ఇండియన్ సినిమా దగ్గర నుంచి వస్తున్న మొదటి బిగ్గెస్ట్ వరల్డ్  ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉందని అందరికీ తెలిసిందే. చాలా అంచనాలు నెలకొల్పుకొని ఒక వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త టెక్నాలజీలు అలాగే ఇండియన్ ఇంజినీర్స్ ఆర్కిటెక్స్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఒక ప్రౌడ్ ఇండియన్ ప్రొడెక్టు గా వస్తుంది. అయితే ఈ సినిమా అసలు వరకు పూర్తయ్యిందో అనే అంశం బయటకి వచ్చింది. ఇది విని ప్రభాస్ ఫాన్స్ కూడా ఒకింత షాక్ కి గురవుతున్నారు.

మరి ఈ సినిమా ఏకంగా అప్పుడే 55 శాతం కంప్లీట్ అయ్యిపోయిందట. మరి ఈ మాట ఎవరో చెప్పింది కూడా కాదు స్వయంగా సినిమా నిర్మాత అశ్వనీ దత్ చెప్పిందే.. దీనితో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ షాకవ్వగా ఈ టాక్ వైరల్ గా మారింది.

ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటులు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ లు నటిస్తుండగా నిర్మాత అశ్వని దత్ సుమారు 500 కోట్లతో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.