చెర్రీకి జాతీయ అవార్డు రాకుండా మోకాలడ్డాడు!
ఇటీవలే ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు మెరిపించింది. ఏకంగా ఏడు అవార్డుల్ని కొల్లగొట్టి ఔరా! అనిపించింది. అయితే ఇంత ఘనకార్యం సాధించినా తెలుగు సినీప్రేమికులు ఓ విషయంలో మాత్రం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా `రంగస్థలం` చిత్రానికి జరిగిన అన్యాయానికి మెగా ఫ్యాన్స్ భగభగ మరుగుతున్నారు. ఆ చిత్రంలో చెవిటివాడైన(బధిరుడు) చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్ చరణ్కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు రాకపోవడంపై మెగాభిమానులు గరంగరంగా ఉన్నారు.
ఎక్కడో తేడా జరిగింది. ఎవరో మోకాలడ్డేశారనే భావనలోనే అంతా ఉన్నారు. అయితే అది నిజమా? జాతీయ అవార్డుల జూరీ కావాలనే ఆ అన్యాయం చేసిందా? జూరీని ఎవరైనా ప్రభావితం చేశారా? అని ఆరాతీస్తే ఓ ఆసక్తికర సంగతి రివీలైంది. రామ్ చరణ్ కి అవార్డు రాకుండా మోకాలడ్డడంలో ఓ సీనియర్ నటుడి బులపాటం ఉందంటూ ప్రచారం సాగుతోంది. అతడు ఎవరో కాదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో విలన్ మామగా నటించిన పరేష్ రావల్ వల్లనే చరణ్ కి పురస్కారం దక్కకుండా పోయిందట. తొలుత జూరీ మైండ్ లో చరణ్ పేరు మెదిలింది. కానీ చివరి నిమిషంలో సీన్ మారింది. అయితే అతగాడు ఎందుకు మోకాలడ్డాడు? అంటే .. విక్కీ కౌశల్ నటించిన ఊరి చిత్రంలో అతడు కీలక పాత్రను పోషించాడు. ఆ క్రమంలోనే అతడికి విక్కీ అంటే విపరీతమైన పుత్రవాత్సల్యం కలిగిందట. దాంతో ఎలాగైనా జాతీయ అవార్డు అతడికే దక్కాలని జూరీని ప్రభావితం చేసేందుకు ఎత్తుగడలు వేశాడన్న మాటా వినిపిస్తోంది. అదొక్కటే కాదు పరేష్ రావల్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో అనుకూలంగా ఉంటారు. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీపైనా నిరంతరం ఒక యజ్ఞంలా సెటైర్లు పేలుస్తుంటారు. అది కూడా ఆయనకు సాయమైందట. అయితే ఇదంతా యాధృచ్ఛికంగానే అయినా అతడు ఇదివరకూ మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే పరేష్ రావల్ వల్ల జూరీ ప్రభావితం అయ్యిందా? అంటే అందుకు డైరెక్టుగా ఎలాంటి ఆధారాలేవీ లేవు. ఊరి కోస్టార్ విక్కీ కౌశల్ కి అవార్డు రావడంపై విపరీతమైన ఆనందం వ్యక్తం చేశారు పరేష్ రావల్. అందుకే మెగాభిమానుల్లో ఇలాంటి కొత్త సందేహం పుట్టుకొచ్చిందని అంతా ముచ్చటించుకుంటున్నారు. ముంబై వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఎవరినైనా ప్రభావితం చేసేంత సీనియారిటీ ఆయనకు ఉంది. అందుకే ఈ సందేహం కలుగుతోంది.
