సంజయ్ దత్ కి కోర్టు నోటీసులు

సంజయ్ దత్ నిర్మాతగా మారి రూపొందిస్తోన్న చిత్రం ప్రస్థానం. తెలుగులో విజయవంతమైన ప్రస్థానం సినిమాకు ఇది రీమేక్. రీసెంట్‌ ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. సెప్టెంబర్ 20న సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో ప్రస్థానం సినిమాను డైరెక్ట్ చేసిన దేవాకట్టాయే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో సంజయ్ దత్‌కు కొత్త సమస్య మొదలైంది. ఈ సినిమా హక్కులు తమవంటూ షీ మార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాత సంజూ బాబాకు నోటీసులు పంపింది. సినిమా ప్రారంభంలోనే తాము సంజయ్ దత్‌తో ఈ విషయంపై చర్చించామని, అయితే ఆయన పట్టించుకోలేదని సదరు నిర్మాణ సంస్థ తెలియజేసింది. మరి సంజయ్ దత్, డైరెక్టర్ దేవాకట్టా దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.