సరిలేరు నీకెవ్వరు  షూటింగ్ లో అంతరాయమా?

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో అంతరాయమా?

 
… అవుననే అంటున్నారు కొందరు.  ప్రిన్స్ మహేష్ బాబు  మేజర్ అజయ్ కృష్ణగా నటిస్తున్న చిత్రం పేరు “సరిలేరు నీకెవ్వరు”.  కాశ్మీర్ అందాలను కెమెరాలో బంధించి ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి  తొలి షెడ్యూల్ని పూర్తి కానిచ్చారు. కాశ్మీర్ లో మేజర్ అజయ్ కృష్ణ ఆపరేషన్ విజయవంతంగా  పూర్తయిందని దర్శకుడు అనిల్ రావిపూడిఇటీవల  ట్వీట్ చేశారు.
 
ఇక హైదరాబాద్ లోనే చిత్రీకరణ ఉంటుందన్నారు. మహేష్ ఇతర చిత్ర బృందంపై కీలక సన్నివేశాలు కాశ్మీర్ లో తెరకెక్కించారు. మహేష్ కు జోడీగా  రష్మిక మండన నటిస్తోంది.  దిల్ రాజు, రామబ్రహ్మమ్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విజయశాంతి నటిగా రీ-ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే! అయితే..  ఈ చిత్రం షూటింగ్ అనుకున్న ప్రకారం జరగడం లేదని, షూటింగ్ లో అంతరాయం ఏర్పడుతుందని  యూనిట్ చెబుతోంది.
 
నిర్మాతలకు, దర్శకుడికీ  మధ్య కొన్ని విషయాల్లో రాజీ కుదరడం లేదని చెప్పుకుంటున్నారు. ఫలితంగా సినిమా విడుదలలో  కూడా  కొంత ఆలస్యం  కావొచ్చని చెప్పుకుంటున్నారు? ఇందులో నిజం ఎంత  ఉందో .. దర్శక, నిర్మాతలకే తెలియాలి మరి!