సాహో బడ్జెట్ 250 కోట్లా? 350 కోట్లా?
ప్రభాస్ నటించిన సాహో గురించి ఎవరికి ఏం తెలుసు? అంటే తెలిసింది చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సినిమా భారీ యాక్షన్ చిత్రమని.. హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేశారని.. బాలీవుడ్ స్టార్లతో భారీ యాక్షన్ అదరగొడుతుందని.. అత్యుత్తమ సాంకేతికతతో అబ్బురపరుస్తుందని ఇలా చెబుతారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ జెట్ స్పీడ్ తో అంతర్జాలంలో దూసుకెళ్లింది. అందులో విజువల్ గ్రాండియారిటీకి స్పెల్ బౌండ్ అయిపోయారంతా. ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 30 రిలీజ్ తేదీ కాబట్టి అప్పటివరకూ ప్రభాస్ అభిమానుల్లోనూ ఉత్కంఠ నిలువనీయడం లేదు.
ఇకపోతే ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికర సంగతులు ఉన్నాయి. అసలు ఈ చిత్రాన్ని కేవలం 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని యువి క్రియేషన్స్ ప్రారంభించింది. అయితే అనూహ్యంగా బడ్జెట్ పెరిగింది. ఆ తర్వాత 225 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారమైనా.. కాలక్రమంలో 350 కోట్ల వరకూ అది పెరిగిందట. ఆ మేరకు ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్ ప్రభాస్ స్వయంగా బడ్జెట్ గురించి వివరాలు అందించారు. 250 కోట్లు కాదు.. 350 కోట్ల మేర బడ్జెట్ ని యు.వి.క్రియేషన్స్ కేటాయించిందని ప్రభాస్ అన్నారు. ఈ సినిమాలో అబుదబీ ఫ్లైవోవర్ పై తెరకెక్కించిన యాక్షన్ ఛేజ్ చిత్రానికి 80 కోట్లు ఖర్చయ్యిందట. అలాగే చాలా సీన్స్ సెట్స్ లో తీశారు. ఏకంగా 70 సెట్లు వేశారట. అందుకోసం అత్యంత భారీగా ఖర్చు చేశారు. 227 రోజుల సమయం షూటింగ్ కి పట్టింది. ఇక ఆగస్టు 18న రామోజీ ఫిలింసిటీలో జరగనున్న ఈవెంట్ కోసం ఏకంగా 1.9కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత పలు మెట్రోల్లోనూ సాహో ప్రమోషన్స్ కి ప్లాన్ చేశారు.
