స్కెచ్ సూపర్: సల్మాన్ సాయిం తీసుకుంటున్న ‘సాహో’

పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వాటితో పాటు తమ చిత్రాల టీజర్స్ ని థియోటర్స్ పంపాలని చాలా మంది ప్లాన్ చేస్తారు. ఎందుకంటే పెద్ద సినిమాల రిలీజ్ అంటే భారీగా ప్రేక్షకులు వస్తారు. అప్పుడు ఆ సినిమాతో పాటే ఈ సినిమా టీజర్ లేదా ట్రైలర్ చూసేస్తారు. ఎక్కువ మందిని ఇలా రీచ్ అవ్వచ్చేనేది నిర్మాతల ఆలోచన. ఇప్పుడు ఇలాంటి ఆలోచనే సాహో టీమ్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం తో పాటు తమ చిత్రం టీజర్ ని కూడా జనాలకు చూపాలనుకుంటోంది.

ప్రభాస్ అభిమానులే కాదు ..సినీ లవర్స్ సైతం హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్న అంశం సాహో చిత్రం. భారీ బడ్జెట్ తో పూర్తి స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ కు చేరుకుంది. అలాగే ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

ఈ ఈద్‌ సందర్భంగా జూన్‌ 5న సాహో కొత్త టీజర్‌ను రిలీజ్ చేయనున్నారట. అలాగే సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన భారత్‌ సినిమాతో పాటు సాహో టీజర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో బ్యూటీ ఇవ్లిన్‌ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో చిత్ర సంగీత దర్శకులు శంకర్‌ ఇషాన్‌ లాయ్‌లు ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు.

దీంతో సినిమా విడుదల ఆలస్యమవుతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వార్తలపై చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాహో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.