‘సాహో’ పారడీ ఫృద్వీతో చేసేసారే (వీడియో)

ఓ పెద్ద హీరో సినిమాలో పేలిన డైలాగుని, సీన్ ని కమిడయన్స్ ప్యారెడీ చేయించటం కామనే. నవ్వుకునేందుకు చేసే ఈ ప్యారెడీలు చాలా సార్లు బాగానే పేలతాయి. గతంలోనూ ఇలాంటి ప్యారెడీలు చాలా వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో అవి తగ్గాయి.

అయితే తాజాగా సాహా సినిమా రిలీజ్ కాకుండానే ఆ చిత్రం ట్రైలర్ లో ప్రభాస్ చెప్పే డైలాగుని ఫృద్వీ చేత ప్యారెడీ చేయించి వదిలారు ‘బుర్రకథ’టీమ్. ఈ రోజు రిలీజైన ట్రైలర్ ద్వారా ఆ విషయం తెలిసింది. ట్రైలర్‌ చివర్లో హాస్యనటుడు ‘30 ఇయర్స్‌’ పృథ్వీ.. ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ చెప్పిన ‘ఫ్యాన్స్‌, డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ డైలాగ్‌ చెప్పడం హైలైట్‌గా నిలిచింది.

Burra Katha Theatrical Trailer || Aadi, Mishti Chakraborthy, Naira Shah |Diamond Ratnababu

వివరాల్లోకి వెళితే..ఆది ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘బుర్రకథ’. డైమండ్‌ రత్న బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘రామాయణంలో రాముడికి శత్రువు రావణాసురుడు. కృష్ణుడి శత్రువు కంసుడు. కానీ, నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ఆది చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇందులో అభి, రామ్‌ అనే రెండు పాత్రల్లో ఆది కనిపిస్తారు.

అభి అల్లరి కుర్రాడిలా ఉంటాడు. కానీ, రామ్‌ చాలా అమాయకుడు. భక్తి, సన్యాసం వంటివి నమ్మే వ్యక్తిగా కనిపించారు. జూన్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.