మొత్తానికి చంద్రబాబుని పట్టేసిన వర్మ

రామ్ గోపాల్ వర్మ ఏ ప్రాజెక్టు ప్రారంభించినా …దానికి మొదటి క్షణం నుంచే పబ్లిసిటీ తెప్పించటానికి రకరకాలు ప్రయత్నాలు చేస్తూంటారు. అందుకోం వివాదాస్పద అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూంటారు. తాజాగా ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తో తలపెట్టిన సినిమాను తిరిగి స్టార్ట్ చేసారు. ఈ మేరకు సినిమాలో నటించటానికి చంద్రబాబును పోలిన వ్యక్తి కోసం అన్వేషణ చేసారు.

ఈలోగా ఆయన అదృష్టం బాగుండి..చంద్రబాబుని పోలిన వ్యక్తి ఒకరకి సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేయటం మొదలెట్టింది. ఇది గమనించిన వర్మ..వెంటనే రంగంలోకి దిగి…ఆ వ్యక్తి వివరాలు సంపాదించాలనుకున్నారు. అందుకోసం ఆయన కొంత మొత్తాన్ని రివార్డ్ గా కూడా ప్రకటించారు..

ఆ  వ్యక్తికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ.. వీడియోలోని ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు చెబితే వారికి లక్ష రూపాయలను రివార్డ్ గా అందిస్తా’ అని వర్మ పోస్ట్ చేసారు. తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసాయని.. రోహిత్ అనే వ్యక్తి తెలియజేసాడని వర్మ ట్వీట్ చేశాడు.


వర్మ తన ట్వీట్ లో .. ‘‘హే రోహిత్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రబృందానికి సి.బి.ఎన్ ని గిఫ్ట్ గా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా చిత్రం ప్రారంభంలో నీ పేరును తెరపై వేసి కృతజ్ఞతలు తెలుపుతా. నేను అన్న మాట ప్రకారం నీకు లక్ష రూపాయల రివార్డ్ ను ఇస్తాను. దయచేసి నీ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ పంపించు.’ అని వర్మ పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ రోహిత్ ఎవరో గాని, చిన్న మెసేజ్ కే లక్ష పట్టేశాడని సోషల్ మీడియా లో కబుర్లు కామెంట్స్ మొదలయ్యాయి.