రెడ్లకి భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట

వివాదాలకు కేరాఫ్ర్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచీ బాగా రెచ్చిపోతున్నారు. వరసపెట్టి ఓ సామాజిక వర్గానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు, తెలుగు దేశం కు వ్యతిరేకంగా ట్వీట్స్ వేస్తున్నారు. వైయస్ జగన్ పార్టీ వచ్చాక… తను రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఎట్టకేలకు ఏపీలో రిలీజ్ చేసుకోవటం చాలా ఉత్సాహంగా ఉన్నాయన.

త్వరలోనే కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసారు. కులాల ఆధారంగా పెట్టుకున్న టైటిల్ ప్రకటించటంతో అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో మరోసారి కులాలను ఉద్దేశిస్తూ మరో పోస్ట్ పెట్టారు.

‘ఎండలకి భయపడి కాదు.. రెడ్లకు భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట’ అని ట్వీట్ చేశాడు. చంద్రబాబు ఓటమి తరువాత నిరాసలో ఉన్న ఆ సామాజిక వర్గానికి చెందినవారిని ఆయన టార్గెట్ చేస్తున్నారు. దాంతో వర్మ ట్వీట్ వారిని మరింత బాధిస్తోంది. మరికొందరైతే ఆ ట్వీట్ తో కులాలని రెచ్చకొడుతున్నారని కేసు పెట్టి కోర్టుకు వెళ్ల వచ్చేమో అని ఆలోచనలో ఉన్నారు.