`సైమా` తర్వాత చరణ్ కు మరో అవార్డ్
జాతీయ అవార్డుల్లో రామ్ చరణ్ `రంగస్థలం` హవా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. నేషనల్ లెవల్ పాలిటిక్స్ వల్ల చిట్టిబాబు నటనను గుర్తించలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ వాళ్ల లాబీయింగ్ ముందు మన రంగస్థలం కనిపించలేదని క్రిటిక్స్ విమర్శించారు. అయితే ఆ లోటును సైమా సౌత్ అవార్డుల వేడుక తీర్చింది. ఇటీవల ఖతార్ లో జరిగిన `సైమా` అవార్డుల వేడుకలో `రంగస్థలం` చిత్రం హవా సాగింది. ఈ సినిమాకి ఏకంగా తొమ్మిది అవార్డులు దక్కాయి. మహానటి.. ఆర్.ఎక్స్ 100 చిత్రాలకు మూడేసి అవార్డుల చొప్పున దక్కాయి. సైమా ఉత్తమ నటుడుగా రామ్ చరణ్ (రంగస్థలం) కి పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ నటిగా కీర్తి సురేష్(మహానటి).. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్(రంగస్థలం) అవార్డులు అందుకున్నారు.
ఉదయభాను రీఎంట్రీ ఇలానా
అయితే తాజా సమాచారం ప్రకారం.. చరణ్ కీర్తి కిరీటంలో మరో అవార్డ్ చేరనుందని తెలుస్తోంది. ఈనెల 29న హైదరాబాద్ నోవాటెల్ (హెచ్ ఐసీసీ)లో జరగనున్న `సంతోషం అవార్డ్స్ 2019` ఉత్సవాల్లో రామ్ చరణ్ కి ఉత్తమ నటుడు అవార్డ్ అందనుందని తాజాగా సమాచారం లీకైంది. అక్టోబర్ 2న `సైరా` రిలీజ్ టెన్షన్ లో ఉండే రామ్ చరణ్ ఈ వేడుకకు తప్పనిసరిగా అటెండ్ కానున్నారని చెప్పుకుంటున్నారు. సంతోషం మ్యాగజైన్ 17 వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ పురస్కారాల ఈవెంట్ ని భారీగా తారా తోరణం నడుమ ఘనంగా నిర్వహించనున్నారు. చాలా కాలంగా తెరమరుగైన యాంకర్ ఉదయభాను ఈ వేదికపై హీరో తనీష్, బిగ్ బాస్ ఫేం తేజస్వి మదివాడతో కలిసి యాంకర్ గా అలరించబోతున్నారట. సైమా తరహాలోనే `రంగస్థలం 2018` చిత్రం అవార్డుల్లో మెజారిటీ భాగం క్లీన్ స్వీప్ చేయబోతోందని తెలుస్తోంది. ఇక ఈ వేదికకు `సైరా` స్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ సహా పలువురు టాప్ స్టార్లు విచ్చేయనున్నారని ఇన్ఫో లీకైంది.