పూరి అలా చేసాడంటే…నమ్మలేకపోతున్నారు

దర్శక,రచయిత పూరి జగన్నాథ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. హీరో క్యారక్టరైజేషన్స్ ని డిఫరెంటట్ గా ప్లే చేసి సూపర్ హిట్స్ ని తెలుగు పరిశ్రమకు అందించారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని పొందుపరుచుకున్న పూరి గత కొంతకాలంగా వెనకబడ్డారు. ఆయన సినిమాలు ఏమీ వర్కవుట్ కావటం లేదు. అయితే ఆయన తన స్ట్రాటజీని మార్చుకున్నారు. యూత్ లో క్రేజ్ ఉన్న యంగ్ హీరోలతో సినిమాలు చేస్తేనే తను వర్కవుట్ అవుతానని నమ్ముతున్నాడు.

అందుకోసం ఇప్పటికే యంగ్ హీరో రామ్ ని లైన్ లో పెట్టాడు. ఇప్పుడు మరో హీరో విజయ్ దేవరకొండని ట్రై చేస్తున్నట్లు వినికిడి. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఇటీవల కాకినాడకు వెళ్లి విజయ్ దేవరకొండని కలిశాడట. కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అక్కడ విజయ్ దేవరకొండ ..డియర్ కామ్రేడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ వస్తే ఫుల్ బిజీ అయ్యిపోతున్నారని గమనించిన పూరి తనే స్వయంగా కథ చెప్పటానికి కాకినాడ వెళ్లారు.

ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ ఏ హీరో కోసం ఇంత డెస్పరేట్ గా ట్రే చేయలేదని సమాచారం. తన శిష్యుడు పరుశరామ్ తో సినిమా చేసి సూపర్ హిట్ ఇవ్వటంతో పూరి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. విజయ్ దేవరకొండ కనుక ఈ ప్రాజెక్టు ఓకే చేస్తే పూరి పంట పండినట్లే అని ఫీలవుతున్నారట. మహేష్ వంటి స్టార్స్ సైతం వెయిట్ చేసిన పూరి ఈ రోజున ఓ యంగ్ హీరో కోసం పనికట్టుకుని వెళ్లి కథ చెప్పటం కాలం మహిమే కదా.