పూరి జగన్ చెడ్డోడంటూ అప్పుడే రామ్ డిక్లేర్ చేసేసాడే

వరస హిట్స్ తో ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్‌ డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా వరస ఫ్లాఫ్ లను ఎదుర్కొంటున్నారు. ఆయన చేస్తున్న కథలు కానీ, క్యారక్టరైజేషన్స్ కానీ వర్కవుట్ కావటం లేదు. బేసిక్ గా ఆయన యూత్ ఆలోచనలకు దూరం అయ్యిపోయాడని అర్దం అవుతోంది.

అందుకేనేమో ఆయన యూత్ లో క్రేజ్ ఉన్న రామ్ తో సినిమా మొదలెట్టారు. కొద్దిగా గ్యాప్‌ తీసుకున్న పూరి త్వరలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా ప్రారంభించనున్నాడు. ఎనర్జిటిక్‌ హీరోగా రామ్‌తో పూరి ఓ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ మేరకు అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ చేసారు.

ఎనౌన్సమెంట్ వచ్చిందో లేదో అప్పుడే ఫొటోలతో రచ్చ మొదలెట్టేసారు. పూరి జగన్నాధ్.. రామ్.. ఛార్మీ కౌర్ ఒకసారి కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ప్రకటించలేదుగానీ #రాపో17(రామ్ పోతినేని) పేరుతో పిలుస్తున్నాడు రామ్.

ఆ సెల్ఫిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి “మంచోడి పాత్రలు చేసి చేసి అలిసిపోయినప్పుడు ఈ చెడ్డవాడిని కలుస్తారు. నా అల్ టైమ్ ఫేవరెట్స్ లో ఒకరైన పూరి జగన్ గారితో ఫైనల్ గా #రాపో17. ఈ బోల్డ్ వైల్డ్ ఫిలిం కోసం ఫుల్ గా ఎగ్జైట్ అయి ఉన్నా” అంటూ ట్వీట్ చేశాడు రామ్.

ఈ సినిమా 2019 జనవరిలో ప్రారంభించి మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నటి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

టూ రామ్ డిక్లేర్ చేసాడే