ఈ రెండు భారీ సినిమాలకి ఒకేసారి ప్రభాస్..ఎప్పుడు నుంచి రంగంలోకి అంటే.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తన బ్రాండ్ తో ఏలేస్తున్నాడు. లాస్ట్ రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్ అయినప్పటికీ నెక్స్ట్ సినిమాలపై అసలు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ నెక్స్ట్ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” చిత్రం రిలీజ్ సిద్ధం గా ఉంది. దీని తర్వాత మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో “సలార్” సినిమా చేస్తున్నాడు అలాగే ఇంకొకటి అయితే ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో “ప్రాజెక్ట్ కే” అనే సినిమా చేస్తున్నాడు.

దీనితో అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఇపుడు అయితే ప్రభాస్ ఒకే సమయంలో ఈ రెండు సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ సెప్టెంబర్ నాల్గో తేదీ నుంచే రెండు సినిమాల షూటింగ్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగనున్నాడట.

ఇక్కడ నుంచి ఈ రెండు సినిమాలు కూడా ఈ నెలాఖరు వరకు షూటింగ్ చేయనుండగా ప్రభాస్ ఒకేసారి పాల్గొననున్నట్టుగా తెలుస్తుంది. ఇక సలార్ సినిమాలో అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రాజెక్ట్ కే లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుంది.