ప్రభాస్ 21.. ప్రభాస్ 22 పాన్ ఇండియా సినిమాలే
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఆషామాషీ స్టార్ కాదు. పాన్ ఇండియా స్టార్. అలాంటప్పుడు ఏదో ఒక రెజియన్ కే పరిమితమై మామూలు సినిమాల్లో నటించేస్తానంటే కుదరదు. అతడు ఏ సినిమాలో నటించినా దేశవ్యాప్తంగా అభిమానులు దాని గురించి ఆరా తీస్తారు. ఆ సినిమా చూడాలని ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యంగా ప్రభాస్ కి సౌత్ లో కంటే నార్త్ లో ఫాలోయింగ్ అసాధారణంగా పెరిగింది. కర్నాటక- మహారాష్ట్ర-కేరళ సహా పలుచోట్ల అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. చెన్నయ్ బేస్డ్ గా.. ముంబై బేస్డ్ గా.. అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఒరిస్సా- ఉత్తరప్రదేశ్ లోనూ అతడికి ప్రత్యేకించి అభిమాన బలగాలు తయారయ్యాయి.
అందుకే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం జాన్ పై అందరి కళ్లు ఉన్నాయి. ఈసారి అతడు ఎలాంటి చిత్రం చేయబోతున్నాడు? అన్న ఆరాలు ఎక్కువగానే ఉన్నాయి. సాహో ఫ్లాపైనా ప్రభాస్ సౌత్ ఫ్యాన్స్ అతడి తదుపరి స్టెప్ ఏమిటి అన్నది చూస్తున్నారు. అందుకే జాన్ పై అంచనాలు పెరుగుతున్నాయి. మారిన ట్రెండ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా కథ విషయంలో ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే స్క్రిప్టును మారుస్తున్నారని చెబుతున్నారు. స్క్రిప్టుతో పాటు కాన్వాసు కూడా యూనివర్శల్ ఆడియెన్ కి జాతీయ స్థాయి ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమాని తీస్తున్నారా అన్నది రివీల్ కావాల్సి ఉంది.
ఇక జాన్ (ప్రభాస్ 20) గురించి చర్చ సాగుతుండగానే ప్రభాస్ ట్రెండ్స్ సోషల్ మీడియాలో వేరొక ప్రచారం హోరెత్తుతోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తారని అక్కడ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించనున్న ధూమ్ 4లో కీలక పాత్రలో నటిస్తాడని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. ధూమ్ 4లో నటించాలన్నది పాన్ ఇండియా స్టార్ గా అతడి ఇమేజ్ ని పెంచేదే. ఇంతకుముందు హృతిక్ రోషన్.. అమీర్ ఖాన్ లాంటి స్టార్లు నటించి ఆ సిరీస్ లో సంచలన విజయాలు అందుకున్నారు. డార్లింగ్ ప్రభాస్ కి అలాంటి ఛాయిస్ వస్తే అస్సలు కాదనకుండా చేయడమే కరెక్ట్ అనేది అభిమానుల మాట. మరోవైపు అల్లు అరవింద్ పాన్ ఇండియా `రామాయణం 3డి` ట్రయాలజీలోనూ ప్రభాస్ రావణాసురుడి పాత్రలో నటిస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇది చేసినా అతడి స్థాయి స్కైని టచ్ చేస్తుంది. మరి ప్రభాస్ ఛాయిస్ ఎలా ఉంది అన్నది తనే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది.