చారిత్ర‌క క‌థాంశంతో ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా దేశ ప్రజలకు డార్లింగ్ అయ్యారు. అతని మాకో లుక్ కి ప‌డిపోని అమ్మాయి లేనే లేదు. అంత‌కుమించి డార్లింగ్ గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి ఆక‌ర్షితుల‌వ్వ‌ని వారు లేనేలేరు.

బాహుబలి తరువాత ప్రభాస్ కి ఫాలోయింగ్ అమాంతం వంద‌రెట్లు పెరిగింది. యూత్ లో అత‌డి గురించిన‌ ఆరాటం మొద‌లైంది. అప్పటి నుండి చాలా మంది అతడిని స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో న‌టిస్తే చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. కానీ అది ఇన్నాళ్లు కుద‌ర‌లేదు. కరణ్ జోహార్ లాంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ప్రభాస్ అందరికీ షాక్ ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

యష్ రాజ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ధూమ్ సిరీస్‌లో ప్రభాస్ నటించనున్నట్లు కొంతకాలం క్రితం కథనాలు వచ్చాయి. కానీ దానిపై ఎటువంటి అధికారిక వార్తా రాలేదు. ఇప్పుడు మ‌రో ఆసక్తికర ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

తానాజీ లాంటి హిస్టారిక‌ల్ వారియ‌ర్ మూవీని తెర‌కెక్కించిన ఓం రౌత్ ప్ర‌భాస్ కోసం మ‌రో హిస్టారిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశాన్ని సిద్ధం చేశాడ‌ని.. దానికి ప్ర‌భాస్ ఓకే చెప్పార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అజయ్ దేవ్‌గన్ ని తానాజీగా ఓం రౌత్ అద్భుతంగా ఆవిష్క‌రించారు. తనాజీ బి-టౌన్లో అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ క్ర‌మంలోనే ప్ర‌భాస్ కి అత‌డు క‌థ చెప్పాడు అన్న వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.