‘అరవింద సమేత’ కు అదే  పెద్ద తలనొప్పి ,తలపట్టుకున్న యూనిట్

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’సూపర్ హిట్   టాక్‌తో దూసుకెళ్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం.. మార్నింగ్ షో నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. దీంతో ఈ సినిమా యూనిట్, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందానికి హద్దులేకుండా పోయింది. అన్ని రికార్డులు బద్దలు కొడుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉత్సాహాన్న దెబ్బకొట్టడానికి పైరసీ రంగ ప్రవేశం చేసింది.

అప్పటికి అరవింద సమేత చిత్ర నిర్మాతలు ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పైరసి భూతం స్వైర విహారం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే  సినిమాలో కీలకంగా నిలిచిన ..ఎన్టీఆర్  ఇంట్రడక్షన్  సీన్ సోషల్ మీడియాలో కనపడి షాక్ ఇచ్చింది.ఈ విషయం తెలిసిన  నందమూరి అభిమానులు వీలైనంతవరకు ఆ సీన్ ను  మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిమిషం 28 సెకన్ల నిడివి కలిగిన ఆ సిన్ ను
ముబైల్ లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు వారి ముందు ఉన్న సవాల్..సినిమా మొత్తాన్ని ఆన్ లైన్ లో పెట్టేస్తున్న ఆన్ లైన్ పైరసీ దారుల నుంచి రక్షించుకోవటం. ఈ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అనేదానిపై కలెక్షన్స్  ఆధారపడి ఉంటాయి.

మరో ప్రక్క ఎన్టీఆర్, త్రివిక్రమ్ టీమ్ అంతా సినిమా టాక్ కు సంబరాలు చేసుకుంటున్నారు. అరవింద సమేతకు వస్తున్న రెస్పాన్స్‌పై హీరో ఎన్టీఆర్
ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన అభిమానులతో పాటు మద్దతుగా నిలిచిన మీడియాకు థ్యాంక్స్ చెప్పారు. అటు చిత్ర యూనిట్‌కి పేరు పేరున అభినందనలు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే ఈ సినిమా విజయం సాధించిందని ఎన్టీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.