పెంగ్విన్ .. సైకో కిల్ల‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ

మ‌హాన‌టి సినిమాతో  జాతీయ ఉత్త‌మ‌న‌టిగా పాపుల‌రైంది కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం సైకలాజికల్ థ్రిల్లర్ పెంగ్విన్ లో న‌టించింది. లాక్  డౌన్ కారణంగా థియేట్రిక‌ల్ రిలీజ్ నిలిచిపోవ‌డంతో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేస్తున్నారు. జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతున్నది.  
 
తాజాగా ట్రైల‌ర్ రిలీజైంది. ఇదో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ స్టోరీతో.. సైకో కిల్ల‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కిన సినిమా.  ఓ సైకో సాగిస్తున్న అకృత్యాలకు బలైన కొందరు చిన్నారుల కథ.  సైకో ఆటను కీర్తి సురేష్ ఎలా కట్టించింది అన్నది సినిమా కథ.  తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిచాడు.  దక్షణాది భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక‌పోతే కీర్తి సురేష్ కి  తెలుగు ప‌రిశ్ర‌మ ఎంత‌మాత్రం క‌లిసి రాలేద‌నే చెప్పాలి. మ‌హాన‌టి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించాక కెరీర్ టేకాఫ్ కాలేక‌పోయింది. ఇప్పుడు పెంగ్విన్ తో ఓటీటీ ద్వారా మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
 
https://www.youtube.com/watch?v=hpD3gIlzpMM