వేశ్య పాత్రలో  పాయల్ రాజ్‌పుత్

వేశ్య పాత్రలో  పాయల్ రాజ్‌పుత్

 
1980-90 దశకాల్లో స్టువర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వరరావు భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ  టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ తెరక్కెక్కుతోంది.  
 
వంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ బయోపిక్‌లో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సినిమాలో పాయల్ వేశ్య పాత్రలో నటిస్తున్నప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో పోలీస్ గెటప్‌లో కనిపించనుంది.
 
అయితే సినిమాలో పాయల్ క్యారెక్టర్ బాగా బోల్డ్‌గా ఉంటుందట. ఇటీవలే షూటింగ్‌లో కొన్ని బోల్డ్ సీన్స్‌తోపాటు ఇంటర్వెల్ సీక్వెన్సును పూర్తిచేసినట్లు తెలుస్తోంది