‘సైరా’ :చిరుని కలిసి పవన్…ఏం చేసారో తెలుసా?

‘సైరా’ :చిరుని కలిసి పవన్…ఏం చేసారో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘సైరా’ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల ఉండటంతో చిరంజీవితో సహా చిత్ర యూనిట్ మొత్తం రాత్రింబవళ్లూ కష్టపడి గ్యాప్ లేకుండా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా చిరును ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రీ ప్రొడక్షన్ ఆఫీస్ కు వెళ్లి మరీ కలిశారు. ఎడిటింగ్ టేబుల్ పై ఉన్న సైరా లో కొన్ని సీన్స్ ని పవన్ కు చూపించినట్లు సమాచారం.

https://twitter.com/mnadendla/status/1153943078547292160

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన నాదెండ్ల ‘పవన్ కళ్యాణ్ గారు, నేను సైరా నరసింహారెడ్డి (చిరంజీవి గారి)తో సమావేశమయ్యాం. చాలా విష‌యాలు చర్చించుకున్నాం. ఆయ‌న జీవిత ప్రయాణం మాకెంతో స్ఫూర్తి క‌లిగించింది. ఆయ‌న‌కు గొప్ప విజ‌యం ద‌క్కాల‌ని ఆశిస్తున్నాను. ఆయ‌న‌తో ఇలాంటి స‌మావేశాలు మ‌రెన్నో జరగాల‌ని ఆశిస్తున్నాను` అంటూ ట్వీట్ చేశారు.