ప‌వ‌న్ వాయిస్ ఓవ‌ర్‌తో సైరా !

సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు గ‌త కొద్ది రోజులుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 3:45 నిమిషాలకు సైరా మేకింగ్‌ వీడియో విడుదల చేయనున్నారు. ఈ వీడియోపై అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్‌తో సైరా మేకింగ్ వీడియో ఉంటుంద‌నే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత సినిమాల‌కి పూర్తిగా దూర‌మైన ప‌వ‌న్ ఇప్పుడు సైరా చిత్రంకి ప‌ని చేయ‌డం సంతోషంగా ఉంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది మ‌రి కొద్ది నిమిషాల‌లో తెలియ‌నుంది. చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, చిరంజీవి, కిచ్చా సుదీప్, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, ర‌వి కిష‌న్‌, న‌య‌న‌తార ,త‌మ‌న్నా, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా, సురేంద‌ర్ రెడ్డి చిత్రాన్ని తెర‌కెక్కించారు. అక్టోబ‌ర్ 2న చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేశారు మూవీ మేక‌ర్స్.