హమ్మయ్య …రిలీఫ్ ఫీలైన ‘సైరా’ టీమ్

‘సైరా’రిక్వెస్ట్ కు గవర్నమెంట్ సరేనంది

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇస్తుందా లేదా అన్న టెన్షన్ తో ఉన్న టీమ్ మొత్తానికి రిలీఫ్ ఫీలైంది. ఈ చిత్రం స్పెషల్ షో లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వారం రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రద్దీ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసమే ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లేఖ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.

తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సైరాను నిర్మించారు.