సూపర్స్టార్ మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు
(మహేష్ 26) సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మహేష్ తదుపరి ప్రాజెక్టు గురించి చర్చిస్తున్నారు. అసలైతే సుకుమార్ దర్శకత్వంలో మహేష్# 27 ప్రారంభించాల్సింది. కానీ స్క్రిప్టు పరంగా సృజనాత్మక విభేధాల వల్ల మహేష్ కాదనుకున్నారు.
ఆ సమయంలోనే గీత గోవిందం
ఫేం పరశురామ్ మహేష్ కి కథ వినిపించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా సమాచారం అందింది. మహేష్ – పరశురామ్ కలయికలో చిత్రాన్ని డిసెంబర్ లో ప్రారంభించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ముహూర్తం పెట్టుకుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. పరశురామ్ ఇప్పటికే స్క్రిప్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేశారట. త్వరలో ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. గీత గోవిందం
లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమాని పెద్ద సవాలుగా భావించి పరశురామ్ పని చేస్తున్నారట. మహేష్ శరీరభాషకు తగ్గట్టే చక్కని వినోదంతో పాటు కొత్తదనం ఉన్న కథను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.