ఒక్క‌డు చూసాకే టార్గెట్ చేసావా బుజ్జి!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా అత‌ని 28వ చిత్రానికి ప‌ర‌శురాం( బుజ్జి) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. గీత గోవిందంతో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌డంతో మహేష్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు. దీంతో నాగ‌చైత‌న్య‌ను సైతం కాద‌ని మ‌హేస్ కోసం స్ర్కిప్ట్ రాయ‌డం మొద‌లు పెట్టి…మెప్పించి ఒప్పించాడు. అప్ప‌టివ‌ర‌కూ చిన్న హీరోల‌తో సినిమాలు చేసుకునే ప‌ర‌శురాంకి గీత గోవిందంతో ఊహించ‌ని స‌క్సెస్ రావ‌డంతో స్టార్ హీరోల దృష్టిలో ప‌డ్డాడు. మ‌హేష్ తోఛాన్స్ అందుకోగ‌లిగాడు. అయితే మ‌హేష్ ని మాత్రం స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఇప్పుడు కొన్ని ఏళ్లే క్రిత‌మే టార్గెట్ చేసిన‌ట్లు తాజాగా ప‌ర‌శురాం రివీల్ చేసాడు.

మ‌హేష్ హీరోగా గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఒక్క‌డు అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిందే తెలిసిందే. హీరోగా ఎదుగుతోన్న మ‌హేష్ కి తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ అది. అత‌ని కెరీర్ లో ఆ సినిమా ఓ మైలు రాయి. ఆ స‌క్సెస్ తో మ‌హేష్ కు హీరోగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌చ్చింది. అయితే ఆ ఒక్క‌డు సినిమానే ప‌ర‌శురాం ని ప‌రిశ్ర‌మ వైపు అడుగులు వేయించిందిట‌. మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయాల‌ని అప్పుడే డిసైడ్ అయ్యాడుట‌. ఇప్ప‌టికీ త‌న క‌ల నెర‌వేరుతుంద‌రి ప‌ర‌శురాం రివీల్ చేసాడు. అయితే సినిమా జీవితం అంత ఈజీ కాద‌ని…ప్ర‌యాణం మొద‌లు పెట్టిన త‌ర్వాత అర్ధ‌మైంద‌న్నాడు.

గుణ శేఖ‌ర్, పూరి జ‌గ‌న్నాథ్ లు న‌ర్సీప‌ట్నం నుంచి వ‌చ్చిన వాళ్లు. వాళ్ల స్ఫూర్తితోనే ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాన‌న్నారు. పూరి అంటే ప‌రిశ్ర‌మ‌లో ఎంత వెయిట్ ఇస్తారో? ఫిల్మ్ ఇండస్ర్టీకి వ‌చ్చిన త‌ర్వాత అర్ధ‌మైంది. సినిమాలు క‌ష్ట‌మ‌ని ఆయ‌న ముందే చెప్పారు. అయినా వ‌ద‌ల్లేదు. క‌ష్ట‌ప‌డి స‌క్సెస్ అయ్యాన‌ని తెలిపాడు. ఇప్పుడా స‌క్సెస్ ని నిల‌బెట్టుకోవ‌డం అవ‌స‌రం. తొలిసారి స్టార్ హీరో మ‌హేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. అభిమానులు స‌హా చాలా విష‌యాలు దృష్టిలో పెట్టుకుని ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ర‌శురాం ప్ర‌యాణం ఒక ఎత్తైతే…ఇప్ప‌టి నుంచి మ‌రోలా ఉండ‌బోతుంది.