బాలీవుడ్‌లోకి ర‌జ‌నీ డైరెక్ట‌ర్‌…

                                                            (మోహన్ కుమార్)

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో క‌నీసం ఒక సినిమా అయినా చేయాల‌ని ద‌ర్శ‌కులు క‌ల‌లు కంటారు. అలాంటి యువ ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ర‌జ‌నీకాంత్‌తో క‌బాలి, కాలా చిత్రాల‌ను తెర‌కెక్కించారు. రంజిత్ సూర్య సినిమాపై వ‌ర్క్ చేస్తున్న‌ట్లు గ‌తంలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం పా.రంజిత్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడ‌ట‌. నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని పా.రంజిత్ ఓ పీరియాడిక్ డ్రామాను తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌కు వెళ్ల‌నుంది ఈలోపు రంజిత్ ఓ త‌మిళ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తాడ‌ట‌.