ఆలీకి షాక్ ఇచ్చిన ఇన్ కం టాక్స్ అధికారి

ఆలీకి షాక్ ఇచ్చిన ఇన్ కం టాక్స్ అధికారి

అలీ హీరోగా పండుగాడి ఫోటో స్టూడియో. ఆడియో విడుదల కార్యక్రమం సరదాగా హైద్రాబాద్లో జరిగింది పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి రూపొందించిన ఈ చిత్ర ఆడియో ను దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను సంయుక్తంగా విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఈ వేడుకలో ముఖ్య అథితులుగా బాపట్ల ఎమ్.పి. నందిగాం సురేష్, హీరో శ్రీకాంత్, సీనియర్ నటుడు నరేష్, అల్లరి నరేష్, బాబు మోహన్, ఛార్మి పాల్గొన్నారు .

ఈ సందర్భంగా నిర్మాత గుదిబండి సాంబిరెడ్డి మాట్లాడుతూ.. . 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కొల్లిపరలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం.. జూనియర్ కళాశాలగా ప్రారంభమై.. నేడు తెనాలి, పొన్నూరు, గుంటూరు, విజయవాడలలో 25 కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో ప్రస్తుతం జూనియర్, డిగ్రీ, బిఈడీ, డిఈడీ, డిఎన్ఎమ్, పిపిటి నర్సింగ్ మొదలగు కోర్సులతో ఈ కళాశాలలను విజయవంతంగానడుస్తున్నాయి . మొట్టమొదటిసారిగా మా బ్యానర్‌లో అలీగారి తో ఈ చిత్రాన్ని నిర్మించాను. . అలాగే మా బ్యానర్‌లో రెండో చిత్రంగా స్టార్ హీరో మమ్ముట్టిగారు నటించిన చిత్రంతో సెప్టెంబర్‌లో మీ ముందుకు రానున్నాము. అని అన్నారు.

చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ‘‘రెండు సంవత్సరాలు ఈ కథ కోసం కష్టపడ్డాను. ఈ కథను దర్శకుడు సుకుమార్ ఓకే అన్న తర్వాతే తెరకెక్కించడం జరిగింది. జంధ్యాలగారి మార్క్ కామెడీతో ఈ చిత్రం ఉంటుంది. ఆలీగారు హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే… పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లై పోతుంది అనేది కాన్సెప్ట్. , ఈ సినిమా షూటింగ్ మొత్తం తెనాలిలో చేశాము. పాటలు మాత్రం అరకులో చిత్రీకరించాము. యాజమాన్య అందించిన సంగీతం ఆహ్లాదంగా ఉంటుంది. అలానే మాస్ ప్రేక్షకులకు చేరువయ్యే తెనాలి అనే సాంగ్ కూడా ఉంది. .. అన్నారు.

హీరో అలీ మాట్లాడుతూ… నా మీద అభిమానంతో ఈ వేడుకకు వచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా గురుంచి మాట్లాడాలంటే.. ఒక రోజు ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ కాల్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఏదో ఇన్ కమ్ టాక్స్ విషయం ఏమో అనుకున్నా కానీ… నా ఫ్రెండ్ ఒకరు సినిమా చేస్తున్నారు మీరు అందులో యాక్ట్ చేయాలని అడిగారు. ఆ ఆఫీసరు ఫ్రెండే ఈ దిలీప్ రాజా అని తెలిసింది. కట్ చేస్తే… నాకు మొదట కొన్ని పాటలు పంపించి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పాను. కథ కూడా చాలా బాగుంది. నిర్మాత వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేత‌గా ఉన్న సాంబిరెడ్డిగారు సినిమాలపై ఇష్టంతో నాపై ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నా అన్నారు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశారు. అందరికీ నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

ఆలీ, రిషిత, వినోదకుమార్, బాబుమోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మీ రాంజగన్, చిత్రం శ్రీను, టీనా చౌదరి, సందీప్ రాజా, జబర్దస్త్ రాము తదితరులు నటించిన ఈ చిత్రానికి సహా నిర్మాతలు: ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం: యాజమాన్య, ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్:షా వాలిన్, మల్లేష్, డాన్స్: రఘు మాస్టర్, అజయ్, శివశంకర్, అమ్మ సుధీర్, నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దిలీప్ రాజా.