ట్రైలర్‌ వచ్చేసింది,సాయి పల్లవి హైలెట్ అయ్యింది

డైరక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’.ఈరోజు చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రం టీమ్. ‘నా పేరు సూర్య. నా పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్సై సంవత్సరం అవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంతో ఇంకా బతికున్నానంటే అందుకు కారణం వైష్ణవి’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలై ఆధ్యంతమూ ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Padi Padi Leche Manasu Theatrical Trailer | Sharwa | Sai Pallavi | Hanu Raghavapudi

అలాగే కమిడియన్ ప్రియదర్శి..‘నువ్వు ఇన్‌స్టెంట్‌గా ఇన్ని దోశలు ఎలా వేస్తావ్‌ రా?’ అని శర్వాను అడిగితే..‘ఆకలి రా బై ఆకలి..’ అన్న డైలాగ్‌, ‘ఈ కోల్‌కతాలో మనకంటే పెద్ద ఎదవ మరొకరు ఉండరు’ వంటి డైలాగులు ఫన్నీగా బాకున్నాయి. అలాగే ‘వెంటపడ్డం వరకు ఓకే. కాదంటే పిచ్చవాడవడం కొంచెం ఓవర్‌గా లేదు?’ అని సాయి పల్లవి శర్వాను ప్రశ్నిస్తుంది.

ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి శర్వాను పూర్తిగా మర్చిపోవాలనుకుంటుంది సాయి పల్లవి. ఈ నేపథ్యంలో ఆమె ఓ కారులో ప్రయాణిస్తున్నప్పుడు శర్వానంద్‌ బైక్‌పై పక్కనుంచి వెళుతూ.. ‘హలో మేడమ్‌ పడనేమోనని భయపడకండి. మిమ్మల్ని పడేసే బాధ్యత నాది’ అని చెప్పి వెళ్లిపోతాడు.

సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారధ్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. జనాల్లో శర్వానంద్, సాయి పల్లవిలకు ఉన్న క్రేజ్ తో సినిమా పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర లిరికల్ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకోవడంతో.. ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమాను డిసెంబరు 21న రిలీజ్ చేస్తున్నారు.