ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతి రోజు పండగే అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశిఖన్నా కథానాయికగా నటిస్తుంది. కొద్ది రోజుల క్రితం తేజూపై కీలక సన్నివేశాలని మారుతి తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఇండోర్ సీన్స్ మాత్రమే తెరకెక్కించిన మారుతి తాజాగా ఔట్ డోర్ షూటింగ్ మొదలు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ లక్ష్మీ నరసింహా స్వామి గుడిపై తొలి షాట్ చిత్రీకరించినట్టు తన ట్వీట్లో తెలిపారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రేక్షకులకి పసందైన విందు అందించడం ఖాయమని అంటున్నారు. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలపడం విశేషం. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు