దీపావళి రోజు ఉదయం ఒకటి..సాయింత్రం ఒకటి

జనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అరవింద సమేత చిత్రం రిలీజ్ అయ్యిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టీ ఎన్టీఆర్ బయోపిక్ పై పడింది. బాలయ్య హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ రెట్టింపు అవుతున్నాయి. ఈ మేరకు బిజినెస్ కూడా ఊపందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్స్ కోసం అభిమానులు ఎదురుచూపులు మొదలయ్యాయి.

 అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ట్రైలర్స్ రెండూ..దీపావళి రోజు రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  కథానాయకుడు – మహానాయకుడు టీజర్లను దీపావళి (నవంబర్ 7)కి రిలీజ్ చేయాలని క్రిష్  ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.  కధానాయకుడు చిత్రం ట్రైలర్  ఉదయం, రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా  ట్రైలర్ సాయంత్రం   రిలీజ్ చేయనున్నారు.

ఇక చిత్రం రిలీజ్ విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా జవనరి 9న `కథానాయకుడు` – రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న `మహానాయకుడు` చిత్రాల్ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టే శరవేగంగా సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ జాయినయ్యారు. ఈ మేరకు పోస్టర్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యా బాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లతో పాటు పలువురు తెలుగు పరిశ్రమకు చెందిన అనేక మంది నటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.