డౌట్: బాలయ్యతో నిత్యామీనన్…సెట్ అవుతుందా అని

                                                                  (సూర్యం)

ఆ మధ్యన సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటిలో సావిత్రిగా చేయటానికి నిత్యామీనన్ ని మొదట సంప్రదిస్తే ఆమె నో చెప్పేసింది. దాంతో ఆ పాత్ర కీర్తి సురేష్ దగ్గరకు వచ్చి ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యింది. ఆ పాత్ర చేయకపోవటానికి తన కారణాలు తనకు ఉన్నాయని నిత్యామీనన్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో చెప్పింది.

అయితే ఇప్పుడు మరోసారి సావిత్రి పాత్ర చేయమని ఆమె తలపు తట్టింది. అయితే ఈ సారి ఆ అవకాసం మిస్ చేసుకోదలుచుకోలేదు నిత్య. అందుకే వెంటనే మరోమాట ఆలోచించకుండా యస్ చెప్పేసింది. అయితే బాలయ్యకు ఆమెకు ఉండే సీన్స్ లో ఆమె నప్పుతుందా అనే సందేహం మాత్రం అభిమానులని పీకుతోంది.

ఎన్టీఆర్‌ జీవితం సినీ రంగంతో పాటు రాజకీయాలతో ముడిపడి ఉంది. అందుకే ఎన్టీఆర్‌తో కలిసి నటించిన హీరోయిన్స్ పాత్రలు కూడా ఈ   చిత్రంలో కీలకం. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఎన్టీఆర్‌, సావిత్రిల నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని రూపొందిస్తున్నట్టు సమాచారం.

బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్‌ ఇందూరి కలిసి  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్  జరుగుతోంది. క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ
చిత్రంలో బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ.. సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల పాత్ర‌ల్లో భారీ తారాగ‌ణ‌మే న‌టిస్తున్నారు.

విద్యాబాల‌న్, రానా, మంజిమ మోహ‌న్‌, సుమంత్‌, రాశీ ఖ‌న్నా, షాలిని పాండే, స‌చిన్ ఖేడేక‌ర్‌, జిన్‌సేన్ గుప్తా, కైకాల స‌త్య‌నారాయ‌ణ, భ‌ర‌త్ రెడ్డి
ఇలా.. చాలా మంది మెయిన్ పాత్ర‌లు స‌హా అతిథి పాత్ర‌ల్లో కూడా మెర‌వ‌నున్నారు.